ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్–ఏ జట్టు సూపర్ ఓవర్లో బంగ్లాదేశ్–ఏపై thrilling విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో పాక్ జట్టు టైటిల్ను గెలవడం మూడోసారి. మ్యాచ్ అనంతరం ఏసీసీ ఛైర్మన్ మోచిన్ నఖ్వీ స్వయంగా ట్రోఫీని పాకిస్థాన్ కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీకి అందజేశారు. అయితే ఈ నిర్ణయం సోషల్ మీడియాలో భారీ వివాదానికి దారితీసింది.
టీమిండియా అభిమానులు నఖ్వీపై మండిపడుతున్నారు. “పాకిస్థాన్ గెలిస్తే నీకు ట్రోఫీ ఇవ్వడానికి పెద్ద ఆసక్తా, అయితే భారత్ గెలిచిన ఆసియా కప్ 2025 ట్రోఫీని ఇవ్వడానికి ఏం సమస్య వచ్చింది?” అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.
ఈ సంవత్సరమే సెప్టెంబర్లో దుబాయ్లో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ పాకిస్థాన్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అయితే అప్పట్లో మోహ్సిన్ నఖ్వీ స్వయంగా ట్రోఫీని ఇవ్వాలని పట్టుబట్టగా, టీమిండియా నిరాకరించడంతో ట్రోఫీ ప్రదాన కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయిన ఘటన అందరికీ గుర్తుంది.
బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నమెంట్లో తమ తొలి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సూపర్ ఓవర్లో అవకాశాన్ని కోల్పోయి నిరాశతో నిలిచింది. పాకిస్థాన్ విజయం, ట్రోఫీ ప్రదానం, నఖ్వీ ప్రకటనలన్నీ మరోసారి ఆసియా క్రికెట్ రాజకీయాలపై చర్చను తెరపైకి తెచ్చాయి.