శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    India Women's Blind Cricket team : భారత్ అంధుల మహిళల టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది

    1 month ago

    కొలంబోలో నిర్వహించిన మహిళల అంధుల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్‌లో నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి చరిత్ర రాసింది. టోర్నమెంట్ మొత్తం భారత జట్టు అజేయంగా, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రదర్శన కనబరిచింది.

    ఫైనల్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నేపాల్ బ్యాటర్లను 114 పరుగుల వద్ద ఆపగా, 115 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 12.1 ఓవర్లలో ఛేదించింది. ఖులా షరీర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

     

    నవంబర్ 11న ఢిల్లీలో ప్రారంభమైన టోర్నీలో భారత్, నేపాల్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా జట్లు పాల్గొన్నాయి. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో గెలిచి భారత్ ఫైనల్‌కు చేరింది. ఈ విజయం దేశంలో అంధుల క్రికెట్‌కు మరింత గుర్తింపు, ప్రోత్సాహం కల్పించనుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    megastar : చిరంజీవి చేతుల మీదుగా ‘స్పిరిట్’ ముహూర్తం షాట్
    తర్వాత ఆర్టికల్
    Kumbakonam : తిరుకుడందై – శారంగపాణి స్వామివారి మహక్షేత్రం

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి