kntv
kntv

పీఓజేకే పరిస్థితులపై పాక్‌ను నిలదీసిన భారత్

1 hour ago

 

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో శాంతియుత నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆరోపించారు. 40 మందికిపైగా మరణించారని, స్వతంత్ర దర్యాప్తు జరిపి పాకిస్థాన్‌ను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది.