kntv
kntv

పూరీలో అరుదైన ఆచారం.. 15 రోజుల విశ్రాంతి

1 hour ago

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయం భక్తులను ఆకట్టుకుంటోంది. జ్యేష్ఠ పూర్ణిమనాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలకు 108 కుండల సుగంధ జలాలతో మహాస్నానం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి జలుబు, జ్వరం వస్తాయని భక్తుల విశ్వాసం. దీంతో 15 రోజుల అనసర కాలం పాటించి, ఆయుర్వేద మూలికలతో చికిత్స నిర్వహిస్తారు