kntv
kntv

90 మీటర్ల కంటే పతకమే ముఖ్యం: నీరజ్ చోప్రా

2 months ago

90 మీటర్ల మార్క్ అథ్లెట్లకు ప్రత్యేకమైనదే అయినా, తనకు పతకమే అత్యంత ముఖ్యమని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నారు. ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్లతో ఒత్తిడిలో పోటీ పడి స్వర్ణం గెలవడం, 90 మీటర్లు దాటి కాంస్యం లేదా నాలుగో స్థానం సాధించడం కంటే గొప్ప విజయమని ఆయన స్పష్టం చేశారు.