గౌహతి, తేదీ: 25 నవంబర్ 202 5: ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ వేదికపై సీఎం హిమంత బిస్వా శర్మ జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించకపోయారని, ఆయనను హత్య చేశారంటూ సెన్సేషనల్ ఆరోపణలు చేశారు. గతంలోనూ మీడియా ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ సారి శాసన సభలో ఈ వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనంగా మారింది. మంగళవారం అస్సాం అసెంబ్లీలో జుబీన్ గార్గ్ మరణంపై చర్చ కోసం ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
ఇకగా, జుబీన్ గార్గ్ మరణంపై దర్యాప్తు నిర్వహిస్తున్న ఏకసభ్య కమిషన్ కూడా సాక్ష్యాలను సమర్పించడానికి మరియు వాంగ్మూలాలు నమోదు చేసుకునే గడువును డిసెంబర్ 12 వరకు పొడిగించింది. గౌహతి హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా నేతృత్వంలోని కమిషన్, నవంబర్ 3న విచారణ ప్రారంభించింది.
జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్లో ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే, ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అస్సాం ప్రభుత్వం ఈ సంఘటనకు సంబంధించి ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసి, విచారణను ముమ్మరం చేసింది. ఏకసభ్య కమిషన్ నవంబర్ 21న సమర్పించాల్సిన నివేదిక గడువును పొడిగిస్తూ, డిసెంబర్ 12 వరకు దర్యాప్తు కొనసాగించనుందని ప్రకటించింది.