kntv
kntv

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

1 month ago

తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆశీనులై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. "గోవింద... గోవింద" నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగగా, వేలాది మంది భక్తులు గరుడసేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.