kntv
kntv

మునేటిలో యువకుడు మృతి....

2 months ago

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర మునేటిలో మంగళవారం ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల విరాల మేరకు.. గొట్టుముక్కల గ్రామానికి చెందిన రామకృష్ణ స్నేహితులతో కలిసి ఈతకు దిగాడు. అతను లోతుకు వెళ్లడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.