kntv
kntv

నేడు ఖమ్మంలో సీఎం రేవంత్ రైతు సభ

3 weeks ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభలో రైతు భరోసా పథకం తుది విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో మొత్తం రూ.8,759 కోట్లు 74 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. సభకు ముందు రైతు మేళాను సందర్శించి ఆధునిక వ్యవసాయ పరికరాలను సీఎం పరిశీలించనున్నారు.