kntv
kntv

కేసినపల్లి -తూర్పుపాలెం తీరంలో రంగు మారిన సముద్రం నీరు

3 weeks ago

 కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి తీరంలో సముద్రపు నీరు అసాధారణంగా రంగు మారి కనిపించింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు లేదా ఓఎన్‌జీసీ వ్యర్థాల ప్రభావమా, లేక సహజ కారణాలా అన్నది తెలియాల్సి ఉంది. అధికారులు నీటి నమూనాలు సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి అసలు కారణాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.