kntv
kntv

పురీలో వైభవంగా జగన్నాథ రథయాత్ర రెండో రోజు

3 weeks ago

ఒడిశా పురీలో ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథ రథయాత్ర రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగుతోంది. భక్తుల జయజయధ్వానాల నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలను వేలాది మంది భక్తులు తాళ్లతో లాగుతూ గుండిచా ఆలయం వైపు తీసుకెళ్తున్నారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పురీ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది.