kntv
kntv

మందేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

1 hour ago

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మందేశ్వరస్వామి వారి ఆలయానికి శనివారం శని త్రయోదశి సందర్భంగా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. శనిదోష నివారణకు ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు.ముఖమండపం సేవల ద్వారా రూ.5,36,900, శనిత్రయోదశి తైలాభిషేకాల ద్వారా రూ.5,08,250 ఆదాయం లభించింది.