kntv
kntv

విద్యుత్ ప్రమాదాలపై అవగాహన : జాగ్రత్తలు తప్పనిసరి

55 minutes ago

విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు సైఫుల్లఖాన్, చాంద్ బాషా సూచించారు. గురువారం చిర్తనకల్, అగసనూరు గ్రామాల్లో ఏఈ వీరేష్, లైన్‌మన్ జిలాని ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిపారు. బోరు బావుల వద్ద పాదరక్షలు వాడాలని పేర్కొంటూ, కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.