kntv
kntv

స్వర్ణమే లక్ష్యం.. సాక్షి చౌదరి ధీమా

3 weeks ago

భారత బాక్సర్ సాక్షి చౌదరి కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా ముందు కు సాగుతోంది. సెమీఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న సాక్షి, ఎంపిక ట్రయల్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను ఓడించడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపింది. ఇప్పుడు ఆ విజయోత్సాహంతో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది.