kntv
kntv

" నిలకడగా గోదావరి..!!

3 weeks ago

గోదావరి వరదల కారణంగా ఏజెన్సీ ప్రాంతాలైన వేలేరుపాడు,కుక్కునూరు మండలాల  ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.నిన్నటి నుండి గోదావరి వరదలు ఉగ్ర రూపం దాల్చడంతో అధికార యంత్రాంగం సైతం అప్రమత్తం అయ్యింది. వరద ఉధృతి కారణంగా పలు గ్రామాల  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ప్రస్తుతం భద్రాచలం వద్ద  నీటి మట్టం 56.10 అడుగులుగా ఉంది.